AP అప్పులపై కేంద్రం పిడుగు...
అప్పులకోసం భగీరథ ప్రయత్నాలు చేసున్న ఏపీ సర్కారుకి కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది.
రుణాలను 27668 కోట్లకు పరిమితం చేస్తూ నోటీసు పంపింది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్రం తెలియచేసింది.
దీంతో తలలు పట్టుకున్న ఏపీ అధికారులు అప్పుల గండం నుంచి ఎలా బయటపడాలో అని మంతనాల్లో మునిగి తేలుతున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ ప్రభుత్వ ఉచిత పథకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇప్పటికే ఉచిత బియ్యం ఇవ్వలేమని చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.